
ఇప్పటికే కుదేలైన సినీ పరిశ్రమ రెండో జాబితా నోటీసులతో మరింత దిగజారుతుందని, పరిశ్రమ మనోస్ధైర్యం దెబ్బ తింటుందని, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ ఇతర సినీ పరిశ్రమల ముందు లోకువ అయిపోతుందన్న కోణంలో ప్రభుత్వ పెద్దలతో వీరు చర్చించినట్టు తెలుస్తోంది. ఓ బడా నిర్మాతతో పాటు, గతంలో హీరోగా, ఇప్పుడు విలన్ గా వైవిధ్యమైన పాత్రలు ధరించి మెప్పిస్తున్న నటుడు పరిశ్రమ తరఫున ప్రభుత్వంతో రాయబారం నడపగా, టీఆర్ఎస్ సర్కారు మెత్తబడినట్టు సమాచారం.
ప్రస్తుతం సాగుతున్న విచారణ కొనసాగినా, మీడియా వర్గాలలో ప్రసారం అవుతోన్న అనవసర ప్రచారాన్ని ఆపే దిశగా చర్యలు తీసుకోవాలని, ఎవరో ఒకరిద్దరి తప్పుల వల్ల తెలుగు చిత్ర పరిశ్రమను ఊబిలోకి నెట్టవద్దని వారు కోరగా, వెంటనే ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి కొన్ని ఆదేశాలు వెళ్లినట్టు మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో రెండవ జాబితా ఉంటుందా? మరింత మంది సెలబ్రిటీలకు నోటీసులు వెళ్తాయా? లేదా? అన్నది అనుమానాస్పదమే అంటున్నాయి మీడియా వర్గాలు.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…