
కొందరైతే ఏకంగా తాను చేసిన దారుణాలు బయటపడకుండా చంద్రబాబే చేయించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా మూడు నెలలు కేసులు పెట్టినందుకు ఆత్మహత్య చేసుకుంటే జగన్ ను 16 నెలల పాటు జైలులో పెట్టి వేధించారంటూ దెప్పి పొడిచారు. దీనికి కొందరు టీడీపీ అభిమానులు సీత అగ్ని పరీక్ష చేసుకుంది గానీ చింతామణి కాదు అంటూ ఎద్దేవా చేసారు. కొందరు అధికార పార్టీ అభిమానులు ఏకంగా ఇప్పుడు కోడెలకు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది అంటూ శాపనార్ధాలు పెట్టారు.
ఈ చావు రాజకీయాలలో మీడియా ఏమీ తక్కువ తినలేదు. గోదావరిలో పడవ మునిగి ఎందరో గల్లంతు అయ్యారు. ఇప్పటివరకు కొంత మంది జాడ తెలియలేదు. అయితే మీడియా ఆ వార్తను వదిలేసి పూర్తిగా కోడెల వార్తల మీద పడింది. కనీసం పోస్టు మోర్టమ్ కూడా పూర్తి కాకముందే పుకార్లు వ్యాపింపచేసి కుట్ర కోణం అంటూ టీఆర్పీల వేటలో పడిపోయింది. మరోవైపు కోడెల అంతిమసంస్కారాలు రేపు మధ్యాహ్నం నరసారావుపేటలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
A new inside news related to a big budget Pan-India South movie has surfaced online.…