
మూడు రాజధానుల మీద టీవీ చర్చలలో గట్టిగా మాట్లాడిన ఇద్దరు పార్టీ నాయకులను వీర్రాజు ఇప్పటికే సస్పెండ్ చేశారు. “వీర్రాజు సొంతంగా తీసుకున్న నిర్ణయమో లేక పార్టీ హై కమాండ్ చెప్పిందో గానీ ఆయన జగన్ పార్టీ అనుకూలమైన లైన్ తీసుకున్నారు. దానికి భిన్నంగా మాట్లాడితే వదిలేది లేదు అన్నట్టు కూడా సంకేతం ఇస్తున్నారు,” అని పార్టీలోని కొందరు అంటున్నారు.
“ఇప్పటివరకు అమరావతికి అనుకూలంగా ఉన్న హిందూ మహాసభను కూడా కించపరుస్తున్నారు. దానితో సంఘ్ పరివార్ కూడా ఈ విషయంలో ఆగ్రహంగా ఉంది. మొత్తానికి వీర్రాజు బీజేపీని వైఎస్సార్ కాంగ్రెస్ బీ-టీం చేసేదాకా వదిలేలా లేరు,” అంటూ వారు విమర్శిస్తున్నారు.
బీజేపీకి కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో నష్టపోయేది ఏమీ ఉండదు. అయితే బీజేపీని నమ్మి పొత్తుపెట్టుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మాత్రం ఇది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అమరావతి రాజధానిగా కొనసాగించడం కోసమే బీజేపీతో పొత్తుపెట్టుకున్నా అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఈ తాజా వైఖరికి సమాధానం చెప్పుకోలేనట్టుగా ఉంది.
Rajinikanth’s highly anticipated sequel Jailer 2, directed by Nelson Dilipkumar, recently completed its shooting schedule.…
Anju Kurian is serving major fashion inspiration with her latest sun-drenched ethnic look. Dressed in…