
ఇంతకీ సోనియా, రాహుల్ లు ఎదుర్కొంటున్న “నేషనల్ హెరాల్డ్” కేసు ఏమిటి..? వారు ఎందుకు న్యాయస్థానం ముందుకు వస్తున్నారు..? అన్న సందేహాలు సామాన్యుల మదిలో మెదిలే ఆలోచనలు. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే… నేషనల్ హెరాల్డ్ పత్రిక సంస్థ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్కు కాంగ్రెస్ 90.25 కోట్ల రుణాన్ని ఇచ్చింది. 2010 డిసెంబర్ 10న ఈ మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతను యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) అనే చారిటీ సంస్థకు పార్టీ 50 లక్షలకు అప్పగించింది.
ఇంత పెద్ద మొత్తాన్ని వసూలు చేసే హక్కును వైఐఎల్కు రూ.50 లక్షలకే అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక ఉద్దేశాలపై కోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. మరో వైపు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా ఇదే అంశాలను లేవనెత్తారు. అంతేకాదు వైఐఎల్లో సోనియా, రాహుల్లకు చెరో 38 శాతం వాటా ఉన్నట్లు ఆయన ప్రధాన ఆరోపణ. హెరాల్డ్కున్న ఆస్తులను చట్టబద్ధంగా సోనియా కుటుంబం సొంతం చేసుకుందంటూ స్వామి పిటిషన్ మేరకు కాంగ్రెస్ నేతలపై చీటింగ్ కేసు నమోదైంది. ఇదీ “నేషనల్ హెరాల్డ్” కేసు కధ కమామీషు!
కుప్పం మండలం నడిమూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మాజీ సైనికుడు వి. చక్రపాణి రెడ్డి ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేసినట్లు…
Today, Malayalam actor Mammootty is celebrating his 75th birthday and as a birthday special for…