
కొందరు భూమా కుటుంబం వెంటే ఉండిపోయినా, 10-15 శాతం మంది మాత్రం వైసీపీతోనే ఉండిపోయారు. అయితే వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం ఎటు వైపు ఉండాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారు. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వైసీపీ చీఫ్ జగన్ గత కొన్ని రోజులుగా నంద్యాలలో మకాం వేసి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2019 ఎన్నికలకు ఈ ఉప ఎన్నికను సెమీఫైనల్గా భావిస్తున్న జగన్, ఎలాగైనా నంద్యాలలో విజయం సాధించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.
సరిగ్గా ఇదే వైసీపీ నేతలను భయపెడుతోంది. ఒకవేళ ఫలితం తమకు వ్యతిరేకంగా వస్తే భవిష్యత్తు ఏంటని భయపడుతున్నారు. ఇప్పటికే ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నామని చెబుతున్న నేతలు.. ఉప ఎన్నిక ప్రభావం వచ్చే ఎన్నికలపై పడితే తమ భవిష్యత్తు అంధకారమేనని భయపడుతున్నారు. జగన్ ఈ ఉప ఎన్నికను అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోకపోయి ఉంటే, అంతా ‘లైట్’గా తీసుకునేవారని, అప్పుడు ఇంత ప్రాధాన్యత దక్కేది కాదని, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితి ఉత్పన్నమై ఉండేది కాదని అభిప్రాయ పడుతున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. పోలవరం నుంచి గోదావరి జలాలను అనకాపల్లి వైపు విడుదల చేస్తున్న నేపథ్యంలో…
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…