
“తనకు భవిష్యత్తులో పద్మశ్రీ అవార్డు వచ్చినా, దాన్ని స్వీకరించబోనని… తెలుగు పరిశ్రమలో ఎస్వీ రంగారావు, సావిత్రి, సూర్యకాంతం వంటి మహానటులకు దక్కని పద్మశ్రీ సత్కారం, తనకూ వద్దని, ఒకవేళ వచ్చినా తిరస్కరిస్తానని” స్పష్టం చేశారు. 28 సంవత్సరాల పాటు నాటకాలు వేశానని, సినీ నటుడు రాళ్లపల్లితో ఏర్పడిన పరిచయం తన జీవితాన్ని మార్చిందని, ఆయనే నాటకాల్లో అవకాశాలు ఇప్పించారని, ఆపై 700కు పైగా చిత్రాల్లో నటించానని తెలిపారు.
ఇక, తన బాల్యమంతా పశ్చిమ గోదావరి జిల్లా శంఖంపేట రైల్వే క్వార్టర్స్ లో గడిచిందని, స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు పోవడమే నిత్య కృత్యమని, దీనికి తోడు హత్యలు, దొంగతనాలు చేస్తున్న వారితో స్నేహంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్న తనికెళ్ల, తాను సినిమాల్లోకి రాకపోయి వుంటే, ఏదో ఓ నేరం చేసి ఖమ్మం జైల్లో గడుపుతూ ఉండేవాడినని తన బాల్య విశేషాలను పంచుకున్నారు.
It has been just over a week since West Bengal delivered one of the most…
One phrase is being repeated almost daily inside the Telugu film industry right now: “audiences…