
అయితే, ఈ రాజకీయ విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా… ఏ పార్టీకైనా, పార్టీ అధినేతలకైనా కొన్ని రాజకీయ విలువలకు కట్టుబడాల్సి ఉంటుంది. అలా అయితేనే ప్రజల్లో వారి పట్ల విశ్వాసం స్థిరంగా, మెండుగా ఉంటుంది. అది చంద్రబాబు అయినా, కేసీఆర్ అయినా, ఇంకెవరైనా గానీ..! కేవలం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్దులతోనే పార్టీని నడిపించాలి. అప్పుడే వారు ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలకు గౌరవం ఇచ్చిన వారవుతారు, అలాగే పది మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తారు.
అలా కాక ఇతర పార్టీల నుండి నేతలను దిగుమతి చేసుకుంటే వారి పార్టీలో నేతలు పెరుగుతారు కానీ నాయకత్వం తగ్గి, మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్న చందంగా తయారవుతుంది. ఒకప్పుడు ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే అధికార పార్టీ పని తీరు అంతలా బాగుంటుందని, ప్రజలకు అంత మేలు జరుగుతుందని నాటి రాజకీయ నాయకులు భావించేవారు. మరిప్పుడు ప్రతిపక్షం ఎంత బలహీనంగా ఉంటే అధికార పార్టీకి అంత హక్కులు వస్తాయని ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనా దృక్పథంలో మార్పు రావాలి. అప్పుడే రాజకీయ నాయకులపై ప్రజలలో విశ్వాసం కలుగుతుంది.
తప్పు ఎక్కడైనా తప్పే… తప్పు ఎవరికైనా తప్పే… అది చంద్రబాబు చేసినా… కేసీఆర్ చేసినా… జగన్ చేసినా… (ఈ అంశంలో జగన్ కు అవకాశం లేదనుకోండి… అది వేరే విషయం…), ఆఖరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినా సరే..!
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…