
అయితే హాజరయ్యింది నలభై మందే అయినా ఏ మాత్రం సోషల్ డిస్టెంసింగ్ అనేది పాటించకుండా గుమ్మి కూడి ఉత్సవంలో పాల్గొనడంతో లక్ష్యం నెరవేరలేదు అనే చెప్పుకోవాలి. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అమాత్యులు కూడా నిబంధనలను పాటించకపోవడం దారుణం అనే చెప్పుకోవాలి.
అసలు ఈ వేడుకను కేవలం పురోహితులతోనే నిర్వహించుకుంటే పోయేది అని సామాన్యులు అనుకునేలా చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరుపునుండి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ కావడంతో మంత్రులను పంపారు ముఖ్యమంత్రి కేసీఆర్.
ఇది ఇలా ఉండగా ఈ వేడుకను టీవీలో లైవ్ టెలికాస్ట్ చెయ్యడంతో భక్తులు తమ టీవీలలోనే చూసుకుని ఆనందపడ్డారు. ఇది ఇలా ఉండగా…. తెలంగాణ లో ఈ రోజు ఉదయం నాటికి కరోనా కేసులు 132కు చేరాయి. ఢిల్లీలోని ఒక ముస్లిం ఈవెంట్ కు సంబంధించిన కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…
One interesting pattern in Anil Ravipudi’s career is becoming hard to ignore. He rarely sticks…