
అదీ కాక తమతో ఏదైనా సమస్య ఉంటే… నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలా పలు సంఘాలు ఉన్నాయని, వీటన్నింటినీ వదిలేసి, పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. తమపై ఆరు కేసులు పెట్టిన పూరీ జగన్నాధ్ కు ‘హార్ట్ ఎటాక్’ సినిమా సర్టిఫికేట్ కోసం సహాయం చేశామని చెప్పారు. పూరీ జగన్నాథ్ తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని, అయితే చట్టంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, దర్యాప్తులో నిజానిజాలు వెలుగు చూస్తాయని తమ ఆవేదన వెళ్లగక్కారు.
ఇదిలా ఉంటే, సీనియర్ సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజ ఈ ఘటనపై స్పందించారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ పై అసలు దాడి ఎందుకు జరిగిందో తనకు తెలియదని, డబ్బుల విషయం నిర్మాతకు సంబంధం ఉంటుంది తప్ప, దర్శకుడికి ఎలాంటి సంబంధమూ ఉండదని, మరి, పూరీ జగన్నాథ్ పై దాడి ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదని అన్నారు. అదీకాక, డిస్ట్రిబ్యూటర్లపై పూరీ జగన్నాథ్ ఎందుకు కేసు పెట్టారో తెలుసుకోవాల్సిన అవసరముందని అన్నారు.
అలాగే మరో సినీ నిర్మాత సి.కళ్యాణ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పూరీ జగన్నాథ్ వ్యక్తిగతంగా డిస్ట్రిబ్యూటర్లపై ఫిర్యాదు చేసి ఉండరని, అలాగే పూరీ జగన్నాథ్ పై దాడికి పాల్పడే వ్యక్తిత్వం కలవారు సదరు డిస్ట్రిబ్యూటర్లు కాదని అన్నారు. ఎంతో కాలంగా డిస్ట్రిబ్యూటర్లు పరిశ్రమలో ఉన్నారని, వారి మంచితనంతో నిర్మాతలు, దర్శకులను ఆకట్టుకున్నారే తప్ప దాడులకు పాల్పడలేదని, బహుశా పూరీ, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య అవగాహనా లోపం కారణంగా సమస్య ఏర్పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎవరినీ కదిపినా, పూరీ జగన్నాధ్ ఉదంతమే వినపడుతోంది.
Folk dancer Madhuri Rathod has reportedly attempted suicide, triggering fresh controversy around her ongoing dispute…
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేప్పట్టి రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పుడు ఏదో జరుగబోతోందని అందరూ ఎదురుచూశారు.…