
అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విలీనం చేసిన కారణంగా, ఈ రెండు మండలాలకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారం కోసమంటూ వెంకటేశ్వర్లు తరచూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు సభకు హాజరై అందర్నీ అవాక్కు చేసిన వెంకటేశ్వర్లు… రెండు మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏపీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన సభకు వచ్చిన వెంకటేశ్వర్లును చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు. అలాగే, వెంకటేశ్వర్లు ప్రస్తావించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చంద్రబాబు అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గపు సమస్యలపై దృష్టి సారించినందుకు తాటి వెంకటేశ్వర్లుపై, అలాగే వాటిని పరిష్కారం చేసే దిశగా చొరవ చూపిన చంద్రబాబుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఫోక్ సాంగ్ డ్యాన్సర్లు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఉన్నప్పుడు, ఈశ్వర్ సాయి భార్య…
కొన్నిసార్లు భ్రమలకు, వాస్తవాలకు తేడా కనిపిస్తున్నా భ్రమలనే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి. భ్రమలు మాత్రం మనం…