
అయితే తెలంగాణ సీనియర్లు ఇంకా కేసీఆర్ మీద గుర్రుగానే ఉన్నారు. సహజంగా ఉద్యమంలో మొదటి నుండి ఉన్న వారు అలిగితే ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడాలి అయితే కేసీఆర్ మాత్రం ఆ పని జూనియరైన కేటీఆర్ కు అప్పగించారు. కేటీఆర్ వ్యవహారశైలి వారికి మింగుడుపడటం లేదంట. ఇటీవలి మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో నాయిని నర్సింహారెడ్డి మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేటీఆర్ ఆయనను ఆ విషయంపై వివరణ కోరారట.
తనేదో క్యాజువల్ గా అంటే మీడియా హైలెట్ చేసిందంటూ నాయిని వివరణ ఇచ్చుకున్నారట. ఈ నేపథ్యంలో క్యాజువల్ టాక్స్ ఏవీ చేయడానికి వీల్లేదంటూ కేటీఆర్ గట్టిగా హెచ్చరించారట. ఎంత తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ పార్టీలోని సీనియర్లకు జూనియరే. ఆయన వయసు వారి రాజకీయ అనుభవం అంత ఉంటుంది. అటువంటిది ఆయన హెచ్చరికలకు దిగినా, బుజ్జగింపులకు దిగినా వారు సహించలేకపోతున్నారు. ఈ పరిణామం పార్టీలో ఎటు దారితీస్తుందో?
A new inside news related to a big budget Pan-India South movie has surfaced online.…