
టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన భూపాల్ రెడ్డి 53,625 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్ధి సంజీవరెడ్డిపై గెలుపొందారు. మొత్తం పోలైన ఓట్లలో టీఆర్ఎస్ కు 93,076 ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 39,451 ఓట్లు పోలయ్యాయి. ఇక, మూడవ స్థానంలో ఉన్న టిడిపికి కేవలం 14,787 ఓట్లను మాత్రమే తన ఖాతాలో వేసుకుంది.
మెదక్ జిల్లాలోని ఈ గెలుపుతో తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు వర్గం సంతోషంగా ఉరకలేస్తోంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో కేసీఆర్ కు గ్రేటర్ పీఠాన్ని సమర్పించి కేటీఆర్ వర్గం పండగ చేసుకోగా, తాజాగా హరీష్ రావు వంతు వచ్చినట్లయింది. నిజానికి ఈ ఎన్నికల ఫలితం ముందుగా అంచనా వేసినదే కావడంతో రాజకీయ పరంగా పెద్దగా ప్రభావం చూపడం లేదు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…