
నిజానికి నంద్యాలలో గెలిచేది టిడిపి గానీ, వైసీపీ గానీ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అనేది ‘అవుట్ ఆఫ్ సిలబస్’ కాగా, ఈ ఫలితాలు వెల్లడవుతున్న సమయంలో… కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఓ అద్భుతమైన జోక్ వేసారు. ఆయనకు జోక్ లాగా అనిపించనప్పటికీ అది విన్న వారికి గానీ, చూసిన వారు గానీ నవ్వుకోకుండా ఉండలేరు. “ఈ ఎన్నికలలో డబ్బులు ఏరులై పారిందని, ప్రధాన పార్టీలు రెండు టిడిపి, వైసీపీ డబ్బులను బాగా పంచిపెట్టాయని చెప్పిన తులసిరెడ్డి, అలా జరిగి ఉండకపోతే కాంగ్రెస్ గెలిచేదని చెప్పి” అందరినీ నవ్వించారు.
ఇలా వీక్షకులను నవ్వించడంలో తాము, తమ పార్టీ నవ్వుల పాలయ్యమన్న సంగతిని బహుశా తులసిరెడ్డి గారు మరిచినట్లున్నారు. నంద్యాల ఎన్నికలలో మొత్తం పోలైన 1.70 లక్షల చిలుకు ఓట్లలో 1% ఓట్లన్నా కూడా 1700 రావాల్సి ఉంటుంది. అది కూడా సాధించలేని కాంగ్రెస్ పార్టీ, ఏకంగా విజయం సాధిచేస్తుందని చెప్పడం తులసిరెడ్డి గారు బహుశా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుండి బయట పడలేదేమో అని చెప్పాలి. ఇలాంటి నాయకులు ఉన్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత అధ్వానంగా మారింది.
Pawan Kalyan’s birthday has turned into a celebration on the big screen as Panjaa returns…
Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…