
రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రుల మధ్య జరిగిన చర్చలు ఏ మాత్రం ఫలితాన్నివ్వకపోగా… రెండు రాష్ట్రాల మధ్య విభేదాలను మరింతగా పెంచాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రిత్వ కార్యాలయం మరోమారు ఈ వివాద పరిష్కారానికి యత్నించాలని కేంద్ర జల వనరుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఉమా భారతి ఈ దఫా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ముఖాముఖీ కూర్చోబెట్టి చర్చలు జరిపితే తప్పించి సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు లేవని గ్రహించారు. ఇదే విషయాన్ని ఆమె ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులకు తెలిపారు.
తాజాగా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ నెల 11, 18, 19 తేదీల్లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య భేటీకి తాము సిద్ధంగా ఉన్నామని… మీ మీ సీఎంలకు అనుకూలమైన తేదీలను తెలిపితే భేటీని ఖరారు చేస్తామని ఆ లేఖలో అమర్ జిత్ సింగ్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ప్రత్యుత్తరాలు అందగానే ఇద్దరు సీఎంలతో కీలక చర్చలకు సంబంధించిన షెడ్యూల్, వేదిక ఖరారు కానున్నాయి.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…