
తాజాగా కూడా పోలవరం ప్రాజెక్ట్ కు ఇప్పటివరకు కేంద్రం కేటాయించిన 100 కోట్లను ఉద్దేశించి వ్యక్తమవుతున్న విమర్శలకు వెంకయ్య నాయుడు ధీటుగా స్పందించారు. “కేంద్రం కేటాయించిన 100 కోట్ల రూపాయలను ‘ముష్టి’ అంటున్నారని, నిజంగా ఎవరైనా ముష్టిగా 100 కోట్లు వేసేటట్లయితే నేను రోజూ పోయి ముష్టి అడుగుతాను, ఆ డబ్బంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఖర్చు పెడతాను, దీనికి తనకేమీ అభ్యంతరం లేదు” అంటూ తీవ్రంగా స్పందించారు.
“అయినా 100 కోట్ల రూపాయలను ముష్టిగా పరిగణిస్తున్నారంటే, వాళ్ళు ఎన్ని వందల కోట్లను కొట్టేసిన వాళ్ళు… అలాగే ఎన్ని వందల కోట్లను దోచుకున్నవాళ్ళు…? అంటూ పరోక్షంగా ఎవరిని టార్గెట్ చేసారో చెప్పకనే చెప్పారు. ఇలాంటి మాటలనీ దుర్మార్గమైనవి, పోలవరం ప్రాజెక్ట్ కు ఉన్న అడ్డంకులను తొలగించిన ఘనత మాదే, పూర్తి చేసేది కూడా మేమే” అంటూ వెంకయ్య నాయుడు ‘100 కోట్ల ముష్టి’పై స్పందించారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…