
“చంద్రబాబు గారూ.. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని పంపించే జీవో 203పై మీ స్టాండ్ ఏమిటి..? అడ్డమైన విషయాలపై జూమ్ లో మాట్లాడే మీకు.. ఈ నెల 5న విడుదలైన జీవోపై మాట్లాడేందుకు వారం దాటినా మనసు రాలేదా? మీరు రాయలసీమ బిడ్డేనా..? మీరు ఏపీవారేనా..?,” అంటూ ఆ పార్టీ నెంబర్ టూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ఇప్పుడు సీమ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు అధికార పార్టీ నేతలు మంచిదే. ప్రతిపక్షంలో ఉండగా… కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని పొలాలు ఎడారిగా మారిపోతుందని జగన్ జలదీక్ష చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చాకా అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కు ముఖ్య అతిధిగా వెళ్లొచ్చారు.
అప్పుడు జగన్ సీమ బిడ్డా కాదా? ఆ విషయం పక్కన పెడితే కేసీఆర్ పై అధికార పార్టీ నేతలు కూడా పెద్దగా మాట్లాడింది ఏముంది? పైగా మనం మనం ఒకటి అంటూ అనేక సార్లు మీటింగ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు కనీసం ఒక ఫోన్ కాల్ చేసైనా సమస్య ను ఎందుకు పరిష్కరించుకోవడం లేదు.
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…
One interesting pattern in Anil Ravipudi’s career is becoming hard to ignore. He rarely sticks…