
విశాఖ జిల్లాలో ఇప్పటికే అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉన్న వారితో విజయవాడలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సైకిలెక్కేయడంతో, అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోయింది. తాజాగా ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలోనూ వైసీపీ ఖాళీ కానుంది.
నేడు విశాఖ పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆ నియోజకవర్గ వైసీపీ నేతలంతా టీడీపీలో చేరనున్నారు. భీమిలి మునిసిపాలిటి మాజీ చైర్మన్ శైలేందర్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ స్థానిక నేతలంతా సైకిలెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆనందపురంలో భారీ ఏర్పాట్లు జరగడంతో విశాఖ జిల్లా కూడా టిడిపి వశం కావడానికి మరెంతో కాలం దూరం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పది రోజుల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం సంగతి దేవుడెరుగు కనీసం తాను స్వయంగా ఇరాన్తో…