
దీనికి కూడా ఇతర రాష్ట్రాల నుండి అభ్యంతరాలు వస్తున్నాయని కాలం గడుపుతున్న కేంద్రం, ఈ ప్రక్రియను చివరి దశకు తెచ్చిందని, అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు రైల్వే జోన్ ను కేటాయిస్తూ ప్రకటన వస్తుందని టిడిపి – బిజెపి ఉమ్మడి ఆభ్యర్దిగా పోటీ చేసి విజయం సాధించిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్ తెలిపారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న మాధవ్ మాట్లాడుతూ… ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిందని, ప్రకటన వెలువడటమే ఆలస్యమని, ఈ విషయమై రైల్వే మంత్రితో బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, హరిబాబు పూర్తి స్థాయి చర్చలు జరిపారని అన్నారు.
మూడేళ్ళుగా నానుస్తూ వస్తున్న రైల్వే జోన్ ప్రకటన వెలువడకుంటే, బిజెపిపై రాష్ట్ర ప్రజలు మరింతగా ఆగ్రహించడం ఖాయంగా కనపడుతోంది. ‘స్పెషల్ స్టేటస్’పై వెనక్కి తగ్గినా, రైల్వే జోన్ పై తగ్గేది లేదని ఉత్తరాంధ్ర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో… తాజాగా మాధవ్ చెప్పిన కబురు, ఈ వేసవిలో చల్లదనాన్ని పంచుతోంది. మరి కేంద్రం నుండి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందోనని ఉత్తరాంధ్ర వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Kamal Haasan is a renowned legend of Indian Cinema and he has been choosing young…
Yash’s Toxic is getting another version in theatres, and this one comes with a noticeably…