Telugu

తమిళ సినీ గడ్డపై తెలుగు హీరో సత్తా!

తమిళ హీరోగా స్థిరపడ్డ తెలుగు వాసి విశాల్, గతంలో జరిగిన నడిగర్‌ సంఘం ఎన్నికల్లో గెలవగా, తాజాగా 2017-19 సంవత్సరాలకు గాను తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడి ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. విశాల్ నాయకత్వంలో ప్రకాష్‌ రాజ్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్ (ఉపాధ్యక్షులు), ఎస్‌ఆర్‌ ప్రభు (కోశాధికారి) కూడా గెలిచారు. తమిళ నిర్మాతల మండలిలో మొత్తం 1,212 మంది సభ్యులుండగా, 1059 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ADVERTISEMENT

అధ్యక్ష పదవికి పోటీచేసిన వారిలో విశాల్‌ కు 478, రాధాకృష్ణన్ కు 355, కేఆర్‌ కు 224 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ రౌండు నుంచే విశాల్‌ ముందంజలో నిలవడం గమనార్హం. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన విశాల్, నిర్మాతలు మార్పును కోరుకున్నారని, వారి మనోభావాలే తన గెలుపుగా మారాయని, ఇక తమ జట్టు అంకిత భావంతో పనిచేసి, నిర్మాతల కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తుందని, తమిళ సినిమాకు మరోసారి స్వర్ణయుగం తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kamal Haasan, RKFI, SU Arun Promise a Huge Action Feast

Kamal Haasan is a renowned legend of Indian Cinema and he has been choosing young…

6 minutes ago

Toxic Has a New Version — And It’s Much Shorter

Yash’s Toxic is getting another version in theatres, and this one comes with a noticeably…

8 minutes ago