
అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ఏమీ చేయలేదా? తనను నమ్ముకున్న వారికి, తన సామజిక వర్గానికి చెందిన వారికి ప్రయోజనాలు చేకూర్చడం తప్ప, ఇతర సామాజిక వర్గాలకు వైఎస్సార్ చేసిందేమీ లేదన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. అయితే తాజా రాజకీయ పరిణామాలతో మళ్ళీ వైఎస్ ప్రస్తావన తేవాల్సి వచ్చిందని పరిశీలకులు వ్యక్తపరుస్తున్నారు. చంద్రబాబు చెప్తున్నట్లుగా… గత ప్రభుత్వాలు విస్మరించిన అంశాన్ని తానూ తెరపైకి తీసుకువచ్చి, కాపులకు న్యాయం చేయాలని చూస్తుంటే తన పైనే బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారన్న వ్యాఖ్యలే నిజమైనవా? వీటికి సమాధానం కాలమే చెప్పాలి!
వైయస్ హయంలో ఏమీ జరగలేదు కాబట్టే… ‘అదేదో’ చందంగా… జగన్ కు కేవలం వంగవీటి మోహన రంగా హత్య ఉదంతం మాత్రమే దొరికిందని, అందుకనే కాపులను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోనూ రంగా హత్య అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ కాపు వర్గాలను భావోద్వేగాలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు వ్యక్తపరుస్తున్న భావాలు. మరి వైయస్ ‘స్వర్ణయుగం’లో కాపులు లేకపోవడం విస్తుగొలిపే విషయమే! అసలు విశేషమేమిటంటే… అప్పటి అంధ్రప్రదేశ్ లోనూ ఎక్కువ ప్రజానీకం కాపు కులస్తులే. మరి వారికే ప్రయోజనం లేకపోతే మరి ఆ ‘స్వర్ణయుగానికి’ అర్ధం ఏమిటని ఎవరికైనా ప్రశ్నలు వస్తే… దానికి నిలువెత్తు సమాధానమే ‘యువనేత’ జగన్ మోహన్ రెడ్డి. ఆనాటి ‘స్వర్ణ’యుగం గురించి వైయస్ వారసుడిగా జగన్ కు తెలిసినంతగా మరొకరికి తెలియదుగా..!
Mirzapur: The Film was released recently and had a huge box office opening. It received…
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…