
కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో ఈ నెల 20 నుంచి కొన్ని సడలింపులు ఇవ్వనున్నట్టు మోదీ వెల్లడించారు. అప్పటివరకు లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు పరచి, దేశంలోని పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలించనున్నట్టు మోడీ ప్రకటించారు. ఈ లాక్ డౌన్ పొడిగింపులో ఇంకో విశేషం ఏమిటంటే… రాష్ట్రాలు అడిగినట్టు ఏప్రిల్ 30వరకు కాకుండా మే 3వరకు పొడిగించడం.
“మే 1న ప్రభుత్వ సెలవుదినం, మే రెండవ తేదీ శనివారం మరియు మే మూడవ తేదీ ఆదివారం. లాక్డౌన్ సడలింపు వచ్చిన వెంటనే ప్రజలు రోడ్లపైకి రావాలని మేము కోరుకోవడం లేదు. అందుకే మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగించడం జరిగింది” అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇది ఇలా ఉండగా… భారత్ లో కరోనా కేసులు 10,000 మార్కుని దాటేశాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 10,363 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఇందులో పదో వంతు అంటే వెయ్యికి పైగా కేసులు డిశ్చార్జ్ కావడం ఉపశమనం కలిగించే విషయం.
For decades, Aamir Khan built his reputation by going against mainstream Bollywood formulas. At a…
At a time when Indian streaming platforms are crowded with glossy thrillers and formula-driven content,…