
‘సాక్షి’ మీడియాకు యాడ్స్ ఇచ్చే విషయమై ఇకపై పునఃసమీక్షించాలని భావిస్తున్నామని, ప్రెస్ కౌన్సిల్ గైడ్ లైన్స్, జర్నలిజం విలువలు పాటించని ‘సాక్షి’ మీడియాకు ఈ రోజు వరకూ యాడ్స్ ఇచ్చామని, ఇకపై ఆలోచిస్తామని అన్నారు. ‘సాక్షి’ మీడియా ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడిన యనమల, ఉద్యోగులు, అర్చకుల జీతాలు తగ్గిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, అందుకు తగిన ఆధారాలను చూపించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల కోసమే తమ మీడియాను వినియోగించుకోవడం సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు.
ఇక, వైసీపీ అధినేత జగన్ గురించి ప్రస్తావిస్తూ… ఒక్క ప్రతిపక్ష నేత గానే కాదు, అసలు, రాజకీయాలకే ఈయన తగడని విమర్శించారు. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేయడంలో హిట్లర్, గోబెల్స్ ను జగన్ మించిపోయాడని విమర్శించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల జప్తు చేసిన 18 వేల కోట్లు జగన్ కు ఎక్కడి నుంచి వచ్చాయని, వాటి గురించి జగన్ ఎందుకు మాట్లాడరని, ఎందుకు మీడియా ముఖంగా సమాధానం చెప్పరని ప్రశ్నించారు. అయితే జగన్ విషయంలో కొత్తగా తెలియాల్సింది కూడా ఏమీ లేదులే… అనుకోవడం ప్రజల వంతవుతోంది…!
Telugu cinema has always been heavily dependent on star power. Big heroes bring big openings,…
Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…