
ఇదే క్రమంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇటువంటి చర్యలకు పాల్పడి దేశం పరువు తియ్యకుండా కేంద్రం ఒక చట్టం కూడా తెచ్చే పనిలో ఉంది. ఈ తరుణంలో జగన్ ప్రభుత్వం ఒత్తిడిలో పడింది. అంతర్జాతీయ కోర్టులకు వెళ్లాల్సి వస్తే పరువు పోతుందని ఇప్పుడు ఆలోచన చేస్తుంది. అదే సమయంలో వెనుకడుగు వేస్తే రాజకీయంగా దెబ్బ అని కూడా అనుకుంటుంది.
గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ రేట్లకు పవన, సౌర విద్యుత్ కొనడం వల్ల భారీగా ప్రజల దానం వృధా అయిందని అధికారులతో చెప్పించి చంద్రబాబు మీద వ్యతిరేకత వచ్చేలా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఈ విషయంలో ప్రధానప్రతిపక్ష పార్టీదే పై చెయ్యి అని చెప్పుకోవాలి. టీడీపీకి బీజేపీకి ఉన్న విబేధాలు అందరికీ తెలిసినవే.
అటువంటిది కేంద్రమే అప్పటి ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి సహజంగానే ఉండదు కదా? పైగా ఈ విషయంలో కోర్టులు కూడా ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి. ఈ తరుణంలో అనవసరంగా ఆ విషయాన్నీ ముట్టుకున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచిస్తుంది.
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఆ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం క్రమంగా పెరుగుతోంది. కనుక…
It has been nearly a month since Andhra Pradesh deputy chief minister, Pawan Kalyan sustained…