
నంద్యాల ఉప ఎన్నికల వరకు ఎలాగైతే చంద్రబాబు పైన జగన్ విరుచుకుపడ్డారో, అదే విధంగా ముద్రగడ తాజాగా వ్యాఖ్యానించారు. ఇందులో కొత్తేమీ లేదు. అయితే ముద్రగడ మీడియా ముందుకు వచ్చిన సందర్భం మాత్రం హైలైట్ అవుతోంది. ఓ పక్కన టిడిపి వర్గీయులంతా సంబరాలు చేసుకుంటుంటే, వారిని వేలెత్తి చూపించడానికి జగన్ బదులు తాను ఉన్నాననే భావన వచ్చే విధంగా ప్రసంగం ఉండడం గమనించదగ్గ విషయం. నిజానికి ఈ విషయం తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుండో చెప్తూ వస్తోంది. ముద్రగడ వెనుక ఉండి ఆడిస్తోంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని టిడిపి చేస్తోన్న ఆరోపణలకు బలం చేకూరినట్లయ్యింది.
అయితే ముద్రగడ వ్యాఖ్యలను ఒక్క జగన్ మీడియా ఛానల్ సాక్షి తప్ప, మరో మీడియా ఏది కూడా పట్టించుకోకపోవడం విశేషం. ఈ అంశం కూడా అత్యంత కీలకమనే చెప్పవచ్చు. సాక్షి మాత్రమే ముద్రగడ ప్రసంగాన్ని ఎందుకు ప్రసారం చేసింది అంటే… నంద్యాల ఫలితాల సరళి చూడగానే హడావుడిగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా కనపడుతోంది. అయితే జగన్ – ముద్రగడలు కలిసి ఎన్ని ‘కుల చిచ్చు’ పెట్టే రాజకీయ ప్రయత్నాలు చేసినా, ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని నంద్యాల ఎన్నికల ఫలితం చెప్పకనే చెప్తోంది.
Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…
Ravi Teja took the box office by storm in August. Irumudi came without the huge…