
“అమరావతిని మార్చే సత్తా జగన్ కు లేదు. రాజధానిని మారిస్తే కొత్త రాజధాని కట్టే సీన్ లేదు. కేంద్రం కూడా సహకరించే పరిస్థితి లేదు. 2014 ముందు తామే అధికారంలోకి వస్తామని, దొనకొండను రాజధాని చేసుకోవచ్చు అని చాలా భూములు కొన్నారు. ఆ తరువాత వాటి రేట్లు పడిపోయాయి. ఇప్పుడు ఈ పుకార్ల ద్వారా దొనకొండలోని వారి భూముల రేట్లు పెంచుకుని అమ్ముకుంటారు. వాటిని కొన్న అమాయకులు నిండా మునుగుతారు,” అని టీడీపీ నాయకుల విశ్లేషణ.
ఇందులో ఎంత వరకూ నిజమో తెలీదు గానీ… బొత్స ప్రకటన తరువాత దొనకొండ చుట్టుపక్కల ఎక్కడ భూముల్లో చూసినా ప్రస్తుతం పదుల సంఖ్యలో వ్యాపారులు, కొనుగోలుదారులు కన్పిస్తున్నారు. ఇదే సమయంలో దొనకొండకు రెండు కిలోమీటర్ల లోపు ప్రధానరోడ్ల పక్కనే ఉన్న భూముల విలువ అమాంతం పెరిగింది. ఎకరా రూ.60లక్షలకు చేరింది. కొద్దిగా దూరంగా ఉన్న భూములు రూ.20లక్షల నుంచి రూ.30లక్షలు పలుకుతున్నాయి. రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరిగింది
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…