
ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాను కొనసాగించాలని, ఎన్నికలు ఎప్పుడు నిర్ణయించాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘానిదే తుదినిర్ణయమని స్పష్టం చేసింది. అయితే జగన్ ప్రభుత్వానికి స్వల్ప ఊరట కలిగిస్తూ… ఎన్నికల ప్రవర్తన నియమావళిని సుప్రీంకోర్టు రద్దు చేసింది.
ఇప్పటికే ప్రకటించిన పథకాలు చేప్పట్టవచ్చని చెప్పింది. దీనితో ఉగాదికి ఇళ్ళ పట్టాల పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. అయితే ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఓటర్లను ప్రభావితం చేసేలా ఎటువంటి కొత్త పథకాలను ప్రకటించవద్దని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
స్థానిక ఎన్నికలు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగాలనే పట్టుదలతో ఏపీ ప్రభుత్వం ఇప్పటిదాకా కరోనా విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనీసం స్కూళ్లకు కూడా హాలిడేస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ విషయంలో ఒక క్లారిటీ రావడంతోనైనా ప్రభుత్వం కరోనా విషయంలో వేగంగా స్పందిస్తుందేమో చూడాలి.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…
South India has this strong hero worship culture, be it cinema or politics. The kind…