
తానూ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చిన మరుక్షణం ఈ ప్రభుత్వం కూలిపోతుందని, తన వెంట దాదాపు 100కు పైగా ఎమ్మెల్యేల బలం, బలగం ఉందని పలు సందర్భాలలో జగన్ చెప్పిన విషయం విజ్ఞులకు విదితమే. అయితే, ఆ తర్వాత జగన్ బయటకు రావడం జరిగింది కానీ, ప్రభుత్వం కూలడం మాత్రం కాదు. ఒకేసారి కాకుండా విడతల వారీగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వైసీపీలోకి ప్రోత్సహించిన జగన్, చివరికి 18 మందిని తన చెంత చేర్చుకోగలిగారు. 100 నుండి 18 వరకు ఎలా పడిపోయింది అన్న విషయం… రానూ రానూ అందరికీ తెలిసి వచ్చింది. అలా జగన్ చేసిన “ప్రగల్భాలు” అంతిమంగా జగన్ ను జైలు పాలు చేసింది.
అయితే గత అనుభవాల నుండి జగన్ పాఠాలు నేర్చుకుంటారని భావిస్తే పొరపాటే అవుతుంది అనే విధంగా తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలు అవేలెండి… ప్రగల్భాలు నిలిచాయి. తనతో 21 మంది అధికార పక్షం నేతలు టచ్, గంటలో ప్రభుత్వం కూల్చివేత… ఇలా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా జగన్ చేసిన వ్యాఖ్యలు తెలిసినవే. మరి ఈ ప్రగల్భాల పర్యవసానాలు కూడా జగన్ అనుభవిస్తున్నారు మరి. అయితే ఇది కేవలం పార్టీ నేతల మార్పు వరకే పరిమితం అవుతుందా లేక గతంలో మాదిరి జైలు జీవితం వరకు తీసుకెళ్తుందా అన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి.
ముఖ్యంగా జగన్ ఢిల్లీ పర్యటన ఈ రకమైన చర్చలకు తావిచ్చింది. ఏపీ అభివృద్ధి కోసమే కేంద్ర మంత్రులతో, రాష్ట్రపతితో భేటీ అయ్యాయని చెప్తున్న జగన్ మాటల వెనుక… అసలు భయం మార్చిలో జరగనున్న ఈడీ విచారణే అని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే… ప్రస్తుత రాజకీయ పరిస్తితులను నిశితంగా పరిశీలిస్తున్న వారు మాత్రం… ‘అడుసు తోక్కనేలా… కాలు కడగనేలా…’ అంటూ ‘ప్రగల్భాలు పలకనేలా… నెత్తిపై తెచ్చుకోనేలా…’ అంటూ విశ్లేషిస్తున్నారు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…