
చంద్రబాబును తిట్టమంటూ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలను ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ద్వారా రోజాకు తెలియజేసిన వీడియోపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. విమర్శలెప్పుడూ నిర్మాణాత్మక ధోరణిలో ఉండాలి గానీ, వ్యక్తిగత ధోరణిలో కాదన్నది రాజకీయ విశ్లేషకులు ఎప్పుడ్ చెప్పే అంశం. కానీ వ్యక్తిగత కక్ష్యలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ పనులు చేస్తున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలకు తేటతెల్లం అయినట్లయ్యింది.
ఒక రకంగా చెప్పాలంటే… జగన్ తన స్వీయ నిర్మాణ దర్శకత్వ పర్యవేక్షణలో వైసీపీ పార్టీని ఒక “బూతుబలి”గా తయారు చేస్తున్నారని నెటిజన్లు వేస్తున్న కౌంటర్లకు కొదవలేదు. ఇందులో రోజాను ఒక పావులా వాడుకుంటున్నారని, ఆవేశం తప్ప ఆలోచనల్లో పరిపక్వత ప్రదర్శించలేని రోజా, ఇందుకు బలిపశువు అవుతున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాజమౌళి ‘బాహుబలి’ ప్రేక్షకుల ఆదరణ పొందడానికి కాస్త సమయం తీసుకుంది గానీ, జగన్ ‘బూతుబలి’ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి పెద్ద సమయం తీసుకోలేదు. ‘బాహుబలి’ మాదిరే ‘బూతుబలి’కి కూడా నెటిజన్లు పట్టం కట్టడంతో… జగన్ బండారం బట్టబయలై అందరికీ తెలిసి వచ్చింది. అంటే తమ పార్టీ నేతల చేత జగనే దగ్గరుండి తిట్టిస్తారన్న విషయం ఈ సందర్భంగా స్పష్టమైంది.
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…