
అదే విధంగా అసలు కరోనా వైరస్ పెద్ద విషయం కాదని దాని ఎఫెక్ట్ ఏపీ ఉండదని, కేవలం ఎన్నికలు ఈ నెలాఖరులోగా జరిగితే వచ్చే 5000 కోట్లు పోగొట్టడానికే చంద్రబాబు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. అయితే ఎన్నికలు జరగకపోతే 5000 కోట్లు పోతాయి అనేది నిజం కాదా అనే సందేహాలు వస్తున్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పదే పదే ఆ మాట ప్రస్తావించినా ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటీషన్ లో ఎక్కడా దాని గురించి ప్రస్తావించడమే దానికి నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో జరగాల్సిన స్థానిక ఎన్నికలు తెలంగాణ ఉద్యమం వల్ల జరగలేదు. ఆ తరువాత ఆలస్యంగా 2014లో జరిగాయి.
అయితే ఆ తరువాత నిధులను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి 2015లో విడుదల చేయించుకున్నారు. దీనితో సహేతుకమైన కారణాలతో ఎన్నికలు జరపలేకపోతే కేంద్ర ఆ తరువాతైనా నిధులు విడుదల చేస్తుంది అనే విషయం స్పష్టం అయ్యింది. దీనితో రాజకీయ కారణాల వల్లే తొందరగా ఎన్నికలు జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ కోరుకుంటుంది అనేది అర్ధం అవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.
Last week was a fairly entertaining one for the Telugu OTT audience as we had…
The Tamil Nadu Assembly is about to witness a historic "face-off" that feels more like…