
జగన్ స్కెచ్ ఇలా ఉంటే అసలు ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కనిపించకపోవడం విశేషం. వైకాపా పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైన వేళ వీరంతా సభకు హాజరు కాలేదు. వీరికి విప్ జారీ చేశామని ఇప్పటికే స్పష్టం చేసిన వైకాపా, వీరు అసెంబ్లీకి వచ్చి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయకుంటే, చట్టపరమైన చర్యలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు స్పష్టమైంది.
మరోవైపు వైకాపా అవిశ్వాసంపై వేగంగా పావులు కదిపిన తెలుగుదేశం పార్టీ తక్షణ చర్చకు అనుమతించగా, ఫిరాయింపు దారులు సభలో లేకుండానే చర్చ జరుగుతోంది. ఇక వారికి వైకాపా జారీ చేసిన విప్ అందిందా? లేదా? అన్న దానిపై జగన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందా? లేదా? అన్న విషయం తెలియనుంది. అతి వేగంగా మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో జగన్ “స్కెచ్”కు టిడిపి కౌంటర్ “స్కెచ్” అదిరింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
The Federation of Indian Pilots has raised fresh concerns regarding the cause of the deadly…
Vijay is dominating headlines again, this time for politics, not films. The latest assembly election…