
ఇప్పటివరకు 20 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు. వీరిని వెనక్కి రప్పించేందుకు, లేదంటే వీరిపై అనర్హత వేటు వేసేందుకు ఏకంగా సుప్రీంకోర్టు గడప కూడా వైసీపీ తొక్కింది. అయితే ఆ 20 మంది ఎమ్మెల్యేల తర్వాత పెద్దగా కదలికలు లేకపోవడంతో గత కొన్ని రోజులుగా వైసీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఏకంగా జగన్ కొన్ని రోజుల పాటు లండన్ లో ఉన్నా, స్థానికంగా ఒక్క నేతలోనూ ప్రకంపనలు లేకపోవడంతో… పార్టీ పరంగా ఇంకా వైసీపీ నుండి ఫిరాయింపులు ఉండకపోవచ్చని భావించారు.
అయితే తాజాగా ఈడీ ఇచ్చిన షాక్ తో మళ్ళీ వైసీపీలో ముసలం ప్రారంభమైందని, ఏ సమయంలోనైనా జగన్ కు భారీ షాక్ తప్పకపోవచ్చన్న టాక్ మొదలైంది. ఈడీ ప్రక్రియ ముందుకు వెళితే జగన్ నివాసంతో పాటు, ఇప్పటివరకు వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న సాక్షి అడ్రస్ కూడా గల్లంతవుతుందన్న సమాచారంతో వైసీపీ నేతలు కొత్త దారుల వైపుకు చూడడం ప్రారంభించారన్నది ఈ వార్తల సారాంశం.
అయితే వైసీపీ వర్గాలు మాత్రం ఇది టిడిపి ‘మైండ్ గేమ్’ అంటుండగా, ఈ సారి టిడిపి వర్గాలు మాత్రం ‘మీరే చూడండి’ అన్నట్లుగా కాస్త మౌనం వహించడం విశేషం. చూడబోతుంటే ఈడీ ఇచ్చిన షాక్ నుండి జగన్ కోలుకునే పరిస్థితులు లేదన్నది రాజకీయ వర్గాలు అంతిమంగా తేలుస్తున్న మాట. ఇటీవల ప్రకటించిన ఈడీ ఆస్తుల అటాచ్ మెంట్ జరిగితే… ఏపీలో ప్రతిపక్షం కనుమరుగైనా ఆశ్చర్యపడాల్సిన పని లేదన్న విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…