
“ఓట్ల రద్దు విషయం చంద్రబాబుకు ముందే తెలుసనీ, అందుకని వారంతా ముందే తమ నల్లధనాన్ని సర్దేసుకున్నారని, ఇది సరికాదని, అందరినీ సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్న” అభిప్రాయాన్ని జగన్ వ్యక్తపరిచారు. ఒక విధంగా ఈ సమాచారం తమకు తెలియకపోవడంతో తమ లాంటి వారమంతా అన్యాయమైపోయామనే భావన, ఆవేదన జగన్ వ్యాఖ్యల్లో వ్యక్తం కావడం విశేషం. ఇంతకుముందు వైసీపీ నేతలు రోజా, అంబటి రాంబాబులు చేసిన వ్యాఖ్యలనే కాస్త అటు ఇటుగా జగన్ వ్యక్తపరిచారు.
అయితే తానూ చేసిన ఈ వ్యాఖ్యల అంతరార్ధం గమనించుకున్న జగన్, ఆ తర్వాత కాస్త సరిదిద్దుకునే ప్రయత్నం చేసి, ప్రజల సమస్యలను ప్రతిబింభించే ప్రయత్నం చేసారు. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ప్రజలు పడుతున్న కష్టాలు అగమ్యగోచరంగా మారాయని, ముందస్తు చర్యలు తీసుకోవడం ఆర్బీఐ అధికారులు విఫలమయ్యారని కవర్ చేసుకునే ప్రయత్నం చేసారు. మొత్తానికి పెద్ద నోట్ల రద్దుపై తన ఆవేదనను బయటపెట్టడంలో జగన్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
Nora Fatehi turns a hotel-room backdrop into her own fashion runway, bringing fearless glamour to…
వై నాట్ 175, ప్రతిపక్షం లేని ఏకైక రాష్ట్రం గా ఏపీ, వై నాట్ కుప్పం.? వై నాట్ మంగళగిరి.?…