
ముఖ్యంగా గత కొంత కాలంగా జగన్ అనుసరిస్తున్న వైఖరితో, పార్టీ నేతలే విస్తుపోతుండడంతో ఇక వైకాపాకు గుడ్ బై చెప్పాలని యోచిస్తున్నారట. దీనికి కారణాలుగా కొందరేమో రాయలసీమ ఉద్యమాన్ని నెత్తికెత్తుకునే విధంగా వ్యవహరించాలని, మరికొందరు జగన్ విధానాలను తప్పు పట్టాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికిప్పుడే వైకాపాకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, రాబోయే రెండేళ్ళల్లో వైసీపీ పరిస్తితి పూర్తిగా మారిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఇవన్నీ ఒకెత్తు అయితే, జగన్ ఎదుర్కొనే కేసుల చిట్టాలు మరొక ఎత్తుగా పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. జగన్ కేసుల కోసం ఇప్పటికే వారానికి ఒక రోజును కేటాయించి మరీ విచారణ జరుపుతున్నారు. దీని ప్రకారం మరో ఏడాదిలో జగన్ భవితవ్యం తేలిపోతుందని, ఆరోపణలు రుజువైతే మరోసారి కటకటాలు చూడాల్సి వస్తుందని పార్టీ వర్గాలు కూడా ఫిక్సయిపోయాయట. దీంతో ముందస్తు చర్యలుగా సేఫ్ సైడ్ లో భాగంగా ఎవరి దారులు వారు వెతుక్కొంటున్నారని రాజకీయ వర్గాల టాక్. ఏ రకంగా చూసుకున్నా రాబోయే రెండు, మూడేళ్ళు జగన్ కు, అయన పార్టీకు అత్యంత క్రియాశీలకంగా మారనుంది.
Former chief minister YS Jagan Mohan Reddy has made it a habit to turn all…
Former Pakistan captain Mohammad Yousuf has linked the team’s recent struggles to their famous 10…