
ఈ ఆరోపణలతో నిజంగా వైఎస్ విజయమ్మ ఎక్కడ ఉన్నారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతోంది. పయ్యావుల ఆరోపిస్తున్నట్లు షర్మిల వద్దే ఉంటున్నారా? ఒకవేళ అదే నిజమైతే షర్మిల ఎక్కడ ఉంటున్నారు? మొన్నటి వరకు ‘పరామర్శ యాత్ర’ పేరుతో పార్టీ బాధ్యతలు నిర్వర్తించిన షర్మిల ఇపుడు జగన్ కు దూరంగా ఉంటున్నారా? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు ఒక్క ఆరోపణతో ప్రారంభమయ్యాయి.
మరి ఈ ఆరోపణలను వైసీపీ సీరియస్ గా తీసుకుంటుందో లేదా లైట్ గా వదిలేస్తుందో గానీ పయ్యావుల ఎత్తుగడ బాగానే ఫలించిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. జగన్ వ్యక్తిత్వాన్ని నిలదీసే ఆరోపణలు కావడంతో వైసీపీ వర్గాలు కాస్త ఘాటుగానే స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…