
అందులో భాగంగానే సోషల్ మీడియాలో జగన్ కు సంబంధించిన ఓ అంశం ట్రోలింగ్ అవుతోంది. ఏపీ, తెలంగాణాలతో పాటు దేశ వ్యాప్తంగా “ఫాస్ట్ ట్రాక్ కోర్టు”లను ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జగన్ లాంటి వ్యక్తులు ఇరుకున పడడం ఖాయమని సోషల్ మీడియాలో పడుతున్న పంచ్ లకు కొదవలేదు. ప్రస్తుతం వారానికొరోజు కోర్టుకు హాజరవుతున్న జగన్, త్వరలో రోజుకొకసారి హాజరయ్యే పరిస్థితి నెలకొంటుందని, అప్పుడు ప్రజా సమస్యల కంటే, తన సమస్యలను తీర్చుకునే క్రమంలో మునిగి తేలతారని కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… బిజెపిలో వైసీపీ విలీనం అయ్యేందుకు సరైన సమయమని… ఇక జగన్ కు మరో అవకాశం లేదని… “సమయం లేదు మిత్రమా… విలీనమా… కారాగారమా…” అంటూ వేస్తున్న పంచ్ లు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి పంచ్ లు ఒక్క జగన్ కే పరిమితం కాలేదు. కాకపోతే ప్రస్తుత వార్త జగన్ పై ఇలాంటి కౌంటర్లు వేసేలా చేస్తోంది… అంతే..!
It is already known that Andhra Pradesh deputy chief minister Pawan Kalyan had left to…
Usually, when an actress goes through a series of films that fail to make the…