
అయితే ఉన్నఫళంగా వివేకా కుమార్తె, సునీతను తెర మీదకు తెచ్చారు. ఆమె కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చారు. ఒక స్క్రిప్టు లో ఇచ్చిన మ్యాటర్ ను చూసి చదవడం విశేషం. “వైఎస్ జగన్మోహనన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని నాన్న కోరిక. అందుకోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా రోజుల నుంచి పులివెందులలో ఒక్కరే ఉంటున్నారు. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. మా కుటుంబంలో అందరం కలిసే ఉంటాం,” అని ఆమె చెప్పుకొచ్చారు.
కుటుంబాన్ని ఈ విషయంలోకి లాగవద్దని మీడియాని, రాజకీయ నాయకులని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే ఆమె పట్ల అందరికీ సానుభూతి ఉన్నా దీనికి కారణం ఎవరు అనేది గ్రహిస్తే మంచిది. ముందు గుండె పోటు అని చెప్పడం వల్లే కుటుంబసభ్యుల మీద అనుమానం మొదలయ్యింది. అదే సమయంలో జగన్, వైకాపా నాయకులు ముఖ్యమంత్రికి, లోకేష్ కి దీనికి లింకు పెట్టి రాజకీయం చెయ్యడం వల్లే వివాదాస్పదం అయ్యింది. మీడియాకు చెప్పే ముందు కుటుంబసభ్యులకు చెప్పుకోవాల్సింది. దానికి తోడు జగన్ ను సీఎంను చెయ్యాలని వివేకా కల అని అసందర్భంగా చెప్పడం కూడా పని గట్టుకుని కొందరికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా ఉంది.
There is no shortage of twists and unexpected returns in Andhra Pradesh and Telangana politics.…
ఇంతకాలం కేసీఆర్ కుమార్తెగా గుర్తింపు, గౌరవం పొందిన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన తర్వాత సొంతంగా గుర్తింపు…