
అయితే ఈ సంఖ్య ఎంతవరకు చేరుతుందో మున్ముందు మీరే చూస్తారు అంటున్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి. ‘పసుపు’ కండువా కప్పుకున్న సందర్భంగా ప్రసంగించిన ఆది, “ఇక, తిరుగుబాటు మొదలైంది, ఇలా పార్టీలోకి వచ్చేవారు చాలా మందే ఉన్నారు, ఎవరు ఎప్పుడు వస్తారో మీకే తెలుస్తుంది” అంటూ చేసిన వ్యాఖ్యలు వైసీపీలో నెక్స్ట్ వికెట్ ఎవరిదన్న విషయంపై ఆసక్తిని పెంచుతోంది. తమతో పాటు వచ్చే వారు చాలా మంది అంటూ పేర్లు చెప్పకుండా వదిలివేయడంతో ప్రస్తుతం వైసీపీ కార్యకలాపాలకు కాస్త దూరంగా ఉంటున్న వారందరి పేర్లు హల్చల్ చేస్తున్నాయి.
చూడబోతుంటే… జగన్ పై వైసీపీ దండు “తిరుగుబాటు” మొదలైనట్లే కనపడుతోంది. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలను పరిశీలిస్తే… నిజానికి ఎప్పుడో టిడిపిలోకి రావాల్సి ఉంది. కానీ, ఆలస్యమైంది అంటే… ఇప్పటివరకు ఉపేక్షించే ధోరణిలో చంద్రబాబు ఉండి ఉంటారని, కానీ, “ఒక్క గంటలో ప్రభుత్వాన్ని పడగొడతాను” అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలతో తేనెతుట్ట కదిలిందని, ఇక వైసీపీ పరిస్థితి “కుక్కలు చింపిన విస్తరి” మాదిరి మారిపోతుందని రాజకీయ వర్గాల్లో అంచనాలు, విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ నలుగురితో మొదలైన వైసీపీ దండు “తిరుగుబాటు” ఎంతవరకు వెళ్తుందో చూడాలి? ఎనీ గెస్..!
The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…