
వాటిలో 6 లక్షల అప్లికేషన్లు 10 రోజుల లోపలే రావడంతో విచారణకు ఆదేశించింది ఎన్నికల సంఘం. దాదాపుగా 45 కేసులు కూడా నమోదు చేసింది. ఈ రెండిటికి సంబంధం ఉందని టీడీపీనే డేటాను దుర్వినియోగ పరచి ఓట్లు తీసేస్తుందని వైకాపా ఆరోపణ. అయితే సేవ మిత్రలో ఎటువంటి డేటా లీక్ జరగలేదని, అదే సమయంలో ఫారమ్ 7 దరఖాస్తులు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పని అని వాదిస్తుంది టీడీపీ. ఇందులో నిజానిజాలు పోలీసులు, కోర్టులు తేల్చాలి.
అయితే ఒక చిన్న లాజిక్ ను లెక్కలోకి తీసుకుంటే ఫారమ్ 7 వివాదంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పాత్రపై అనుమానాలు రాకమానవు. ఫారమ్ 7 దరఖాస్తులు తక్కువగా వచ్చినవి కడప, కర్నూల్ జిల్లాల నుండి. ఈ రెండు జిల్లాలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ కంచుకోటలు. ఇది టీడీపీ పని అయితే ఎక్కువ ఓట్లు తీసెయ్యడానికి ఈ జిల్లాల నుండే ఎక్కువ ప్రయత్నాలు జరిగేవి. కాబట్టి ఇప్పుడు అనుమానాలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ మీద ఉండటం సహజం. ఏది ఏమైనా ఏ పార్టీ చేసిన ఓట్లను తీసి వేసి గెలవాలి అనుకోవడం రాజకీయాలలో కొత్త లోతు అనే చెప్పుకోవాలి.
Sanjay Leela Bhansali recently confirmed the release date of Love & War, bringing relief to…
A student on an F-1 visa secured an internship with Amazon, but the opportunity soon…