
అయితే ఎక్కడా ఆమెకు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో చివరకు సారీ చెప్పేందుకే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా రోజా రాసిన క్షమాపణ లేఖ గురువారం నాడు స్పీకర్ కార్యాలయానికి చేరింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా రోజా కామెంట్లకు టీడీపీ ఎమ్మెల్యే అనిత నిండు సభ సాక్షిగా కంటతడి పెట్టుకున్న విషయాన్ని కూడా రోజా తన క్షమాపణ లేఖలో ప్రస్తావించారు. నాడు తాను చేసిన వ్యాఖ్యలు అనితను బాధించి ఉంటే… ఆమెకు కూడా సారీ చెబుతున్నట్లు రోజా సదరు లేఖలో పేర్కొన్నారు.
మరి ఈ సారీపై వైసీపీ అధినేత జగన్ వర్యులు ఎలా స్పందిస్తారో? నాడు రోజాను వెనుకేసుకుని వచ్చిన జగన్, అసలు రోజమ్మ ఎలాంటి తప్పు చేయలేదని కితాబిచ్చారు. మరి ఎలాంటి తప్పు చేయకుండా సారీ చెప్తే పార్టీ అధినేత ఒప్పుకుంటారా? అపరిపక్వ రాజకీయాలకు జగన్ నిదర్శనం అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. పెద్ద తరహాగా, వైసీపీ అధ్యక్షుడిగా నాడే హుందాగా ప్రవర్తించి, రోజా చేత ఆ రెండు అక్షరాలు పలికించి ఉన్నట్లయితే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా!? ఇంతకాలం వేచిచూసినా… ఆ రెండక్షరాలు చెప్పక తప్పలేదు… తప్పు ఒప్పుకోక తప్పలేదు..!
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…