
ఈ కేసుకు సంబంధించి రోజా తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ వినిపించిన వాదనల విషయానికొస్తే… 340వ నిబంధన ప్రకారం కేవలం ఒక సెషన్ కే సస్పెండ్ చేయవచ్చని, ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే రోజాపై చర్య తీసుకున్నారని ఆమె వాదిస్తూ 340 నిబంధన తనకు తెలియదని యనమల అనడం సరికాదన్న విషయాన్ని న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ‘యనమల’కు అన్ని నిబంధనలపై అవగాహన ఉందని, 340 నిబంధన కింద ఏడాది పాటు సస్పెన్షన్ కుదరదని ఆమె వాదించారు.
ఐదేళ్ల పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా తనకు ఉందని సభ అనుకుందా? ప్రతిపక్షం మొత్తాన్ని ఐదేళ్ల పాటు బయటకు పంపడాన్ని అనుతిద్దామా? అంటూ రోజా తరపు న్యాయవాది కోర్టులో ప్రశ్నించారు. సభను సజావుగా నడపడానికే 340 నిబంధన ఉందన్న విషయం మరిచిపోకూడదని, రోజా పేరును తీర్మానంలో మెన్షన్ చేయలేదని, వివరణ ఇచ్చుకునే అవకాశం ఆమెకు ఇవ్వలేదని, ఏ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటారని ప్రశ్నించినట్లు సమాచారం. ఇది బాధ్యత లేని నిర్ణయమని, తుది ఉత్తర్వులు వచ్చే వరకూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని, అసెంబ్లీకి వెళ్లే అవకాశం రోజాకు కల్పించాలని రోజా తరపు న్యాయవాది విన్నవించుకున్నట్లు సమాచారం.
What everyone would normally laugh off as absurd is now turning into a shocking buzz.…
Tamil actor Thalapathy Vijay has created a new wave in Tamil Nadu politics. His TVK…