
దీంతో రంగంలోకి దిగిన వైకాపా మీడియా అధికార ప్రభుత్వంపై ఉన్న తన అక్కసునంతా వెళ్లగక్కుతోంది. ప్రతిపక్షాల నాయకులను ఇరుకున పెట్టేందుకే మల్లాది విష్ణు పై కేసులు నమోదు చేస్తోందని, ఈ కేసులో ప్రభుత్వం అత్సుత్సహాం చూపుతోందని కధనాలను ప్రచురిస్తోంది. ‘మల్లాది విష్ణు దొరికాడు కాబట్టి, కేసులతో అధికార ప్రభుత్వం ఇరికించేయడానికి చూస్తోందని’ ఓ రేంజ్ లో రాతలు రాస్తోంది.
అంటే… రాష్ట్రంలో ఏం జరిగినా ప్రభుత్వం చూస్తూ ఉండాలన్న భావనను వైకాపా మీడియా వర్గాలు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చూసి చూడనట్లుగా వ్యవహరించిన విధానాన్నే చంద్రబాబు సర్కార్ కూడా అనుసరించాలని భావిస్తున్నారేమోనన్న భావన విశ్లేషకుల నుండి వస్తున్నాయి. అర్ధం పర్ధం లేని వ్యాఖ్యలు చేయడం, రాతలు రాయడం జగన్ కు సపోర్ట్ చేసే “వెబ్ మీడియా”కు పరిపాటిగా మారిపోయిందని వీరి భావన.
The December release battle is getting interesting with Balakrishna’s NBK111 Dada and Nagarjuna’s King 100…
After days of uncertainty, Nani’s The Paradise is finally staying on course for its original…