
1000 రూపాయల నోటును మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టే యోచన లేదని, అలాంటి వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చిచెప్పారు. తాజాగా సేవింగ్స్ అకౌంట్స్ పై నిబంధనలు సడలిన నేపధ్యంలో కరెన్సీ అందరికీ అందుబాటులోకి వచ్చిందని, అయితే అవసరం మేరకే ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వెయ్యి రూపాయల నోటు గురించి విషయం ఇలా ఉంటే, ప్రజలకు ప్రీతిపాత్రమైన మరో నోటును ఆర్బీఐ విడుదల చేసింది.
ఇండియన్ కరెన్సీకి కొలమానమైన ఒక రూపాయి నోటు కొన్ని సంవత్సరాలుగా ప్రజలను పలకరించడం లేదు. నోట స్థానంలో కాయిన్స్ వచ్చాయి గానీ, ఒక రూపాయి నోటు లుక్కే వేరన్న విషయం పాత తరానికి తెలిసిందే. అయితే అంతటి ప్రాధాన్యత గల ఒక రూపాయి నోటును తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా విడుదల చేసింది. దీంతో పెద్దోళ్ళ కోసం 2 వేలు, పేదోళ్ళ కోసం 1 రూపాయి నోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న టాక్.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…