
అయితే కేరళలో డబ్బు అందుకున్న ఓ మహిళకు డబ్బు అందుకున్న తరువాత కూడా వింత కష్టాలు ఎదురయ్యాయి. బ్యాంకు నుంచి డ్రా చేసిన రెండు వేల కరెన్సీ నోట్లను పొందిన సదరు మహిళ ఓ నోటు డ్రా చేసిన కొద్ది సమయానికే ముట్టుకుంటే చిరిగిపోవడం ప్రారంభించింది. తాళిపరంబ టౌన్ లోని ఫెడరల్ బ్యాంకు బ్రాంచ్ నుంచి రెండు వేల నోట్లు తీసుకున్న పీసీ షరీఫా అనే మహిళకు ఈ అనుభవం ఎదురయింది. తీసుకున్న నోట్లలోని సీరియల్ నంబర్ 456828 ఉన్న రెండు వేల నోటు ముట్టుకుంటేనే చివర్లలో చిరిగిపోవడం ప్రారంభించింది.
ఈ విషయంపై సదరు మహిళ కుమారుడు షిమీల్ మీడియాకు తెలుపుతూ ఒక నోటు చినిగిపోగా మిగిలిన నాలుగు నోట్లు కూడా అలాగే చిరిగిపోతుండటం గమనించి వాటిని వెంటనే ఖర్చులకు వాడేశానని చెప్పాడు. తన వద్ద ఉన్న బాగా చిరిగిన నోటును ఎవరూ తీసుకోవడం లేదని ఆ నోటును మీడియాకు చూపించాడు. చివరకు ఈ నోటుని తీసుకొని బ్యాంకు వెళ్లి తిరిగి ఇచ్చేస్తానంటే బ్యాంకు వారు కూడా నోటును తీసుకోలేదని తెలిపాడు. ఈ విషయంపై బ్యాంకు అధికారులను అడిగినా స్పందించలేదు.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…