
కట్ చేస్తే… 2022 జనవరి 12వ తేదీ… 20 నిముషాల సీఎం రహదారి ప్రయాణానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాఫ్టర్ లో ప్రయాణించారు, అది కూడా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నపుడు!
కాలం ఏది ఉంచుకోదు… కాస్త సమయం అటు ఇటు కావచ్చు గానీ, ఎవరికి ఇవ్వాల్సింది వారికి తిరిగి ఇచ్చేస్తుందని చెప్పడానికి ఓ ఉదాహరణగా ఈ ఉదంతం నిలిచిపోతోంది. సీఎం జగన్ చేసిన ప్రయాణాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు, నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
నాడు చంద్రబాబు, నేడు వైఎస్ జగన్… ఇద్దరు ముఖ్యమంత్రులు చేసిన ప్రయాణాలు, లక్ష్యాలలో కూడా చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల విషయంలో, అలాగే పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు చేసిన ప్రయాణాలలో చార్టెడ్ ఫ్లైట్ ను వినియోగించారు.
నేడు జగన్ చేసిన ప్రయాణం ఏమిటంటే… నాడు చంద్రబాబు నాయుడు పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో చేసిన ప్రయత్నాలలో భాగంగా… చెన్నై, బెంగుళూరులలో ఏర్పాటు అయిన ఐటీసీ హోటల్స్ గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
1.44 ఎకరాలలో సువిశాలంగా ఏర్పాటు చేసే విధంగా, అందులోనూ నాటి ప్రభుత్వం ప్రతిపాదించిన రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఉండే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి 2016లో చంద్రబాబు నాయుడు చేత శంకుస్థాపన చేయబడిన హోటల్ ను ప్రస్తుత సీఎం జగన్ ప్రారంభించడానికి వెళ్లారు.
సీఎం నివాసం నుండి గుంటూరు ఐటీసీ హోటల్ కు రహదారి ద్వారా ప్రయాణించాలంటే దాదాపుగా 45 నిముషాలు ప్రయాణం చేయాల్సి ఉంది. అదే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా సీఎం కాన్వాయ్ అయితే అందులో సగం సమయం మాత్రమే ఉంటుంది. మరి ఈ ప్రయాణానికి సీఎం చార్టెడ్ ఫ్లైట్ వినియోగించడమే ఈ ట్రోలింగ్ కు ప్రధాన కారణం.
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…
Simran Dhanwani is redefining the classic red saree with a bold, contemporary twist. Draped in…