
అయితే తాజాగా తిరుపతిలో సమావేశం అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం 2019లో ఏపీ అధికారం తమదే అంటున్నారు. కనీసం ఈ స్థాయి వ్యాఖ్యలు చేయాలంటే ఏపీలో రాజకీయ అవగాహన ఎంతో ముఖ్యం. మరి ఆమ్ ఆద్మీ సౌతిండియా ఇంచార్జ్ అయిన సోమ్ నాథ్ భారతి ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉందో తెలిస్తే… ప్రతి ఒక్కరూ అవాక్కవ్వాల్సిందే. ‘ప్రత్యేక హోదా’ కోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చిన సదరు నేత చేసిన ప్రకటన మీడియా వర్గాలనే ఖంగు తినిపించింది.
ఏపీలో పవన్ కళ్యాణ్ పార్టీ అయిన ‘జనసేన’ ఒకటుందన్న విషయం అసలు తమకు తెలియదని అవాక్కయ్యేలా చెప్పారు. 2019లో పవన్ పార్టీ ‘జనసేన’తో పొత్తు ఉంటుందా? అన్న ఓ విలేఖరి ప్రశ్నకు జవాబుగా ‘అసలు అలాంటి పార్టీ ఒకటి ఉందని తమకు తెలియదని’ జవాబు చెప్పడంతో… సదరు విలేఖరి ‘మీరేం సౌతిండియా ఇంచార్జ్ సార్’ అనడంతో చిన్నబోవడం సోమ్ నాథ్ వంతయ్యింది. అలా 2019లో ఏపీలో అధికారంలోకి రాబోయే పార్టీ సౌతిండియా ఇంచార్జ్ కు అనుకోని పరాభవం ఎదురయ్యింది.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…