
వీరితో పాటు ధన్య తమ్ముడు శామ్యూల్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాన్ జాక్సన్ కు చెందిన సంస్థ తమిళనాడులోని నాగర్ కోయిల్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అపార్టు మెంట్లు కట్టిస్తామని చెప్పి ఒక్కో కస్టమరు నుంచి 40 లక్షల నుంచి 1 కోటి వరకు వీరు తీసుకున్నారు. ఆ విధంగా తీసుకున్న డబ్బు మొత్తం 100 కోట్లు ఉంటుంది. అయితే, అపార్టుమెంట్ విషయమై సదరు కస్టమర్లు ప్రశ్నిస్తుంటే వీరు ముఖం చాటేస్తున్నారు.
దీంతో, విసిగిపోయిన కస్టమర్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. కాగా, 2014 నుంచి ఈ కేసు వ్యవహారం నడుస్తోంది. ధన్య మామ జాకబ్ శాంసన్ ని పోలీసులు గతంలో అరెస్టు చేయగా, తాజాగా, జాన్ జాకబ్, ధన్యను పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. ఓ పక్కన సినీ రంగంలో విరివిగా సంపాదిస్తూనే, మరో పక్కన ఇలా మోసపూరితంగా డబ్బులు కూడబెట్టడాన్ని కస్టమర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటనల వలన సినీ పరిశ్రమకు కూడా చెడ్డ పేరు వస్తోందని సినీ వర్గీయులు కూడా వాపోతున్నారు.
One of the crucial failures of the TDP+ government before the 2019 Andhra Pradesh election…
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…