
‘తెలుగులో ఎన్టీఆర్ ను మించిన నటుడు మరొకరు లేరు, ఆయనకు ఆయనే సాటి, తెలుగు వరకు తన అభిమాన హీరో ఎన్టీఆర్ అని,’ అయితే తన అన్నయ్య చిరంజీవికి కూడా తానూ వీరాభిమానిని, క్రేజ్ లో అన్నయ్యతో పోటీ పడే అవకాశం ఎవరికీ లేదని, హిందీలో అమితాబ్ అంటే తనకు చాలా ఇష్టమని, ‘షోలే’ సినిమాలో ‘జో డర్ గయా… ఓ మర్ గయా…’ డైలాగ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన పవన్… బాలీవుడ్ లో అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, నిషికాంత్ కామత్ వంటి దర్శకులంటే తనకు ఏంటో గౌరవమని, వాళ్ళ దర్శకత్వంలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లోకి వెళ్తాను… ఇక సినిమాలకు గుడ్ బై చెప్తాను అంటూ పవన్ చేసిన ప్రకటనలు పవర్ స్టార్ అభిమానులను బాధించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దీనిని సవరిస్తూ బాలీవుడ్ దర్శకుల పేర్లు చెప్పి, వాళ్ళ డైరెక్షన్ లో చేయాలని చెప్పడంతో పవన్ మరిన్ని సినిమాలలో నటిస్తారన్న నమ్మకాన్ని అభిమానులకు కలిగిస్తోంది. అయితే ఇక్కడ పవన్ చెప్పిన నిబంధన ఏమిటి అంటే…. అనురాగ్ కశ్యప్, విశాల్ భరద్వాజ్, నిషికాంత్ కామత్ వంటి దర్శకుల పేర్లు మాత్రమే చెప్పారు. మరి అవార్డ్ విన్నింగ్ సినిమాలను తీసే అనురాగ్, విశాల్ లు పవన్ తో సినిమాను చేయడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ సదరు దర్శకులు ముందుకు వస్తే… పవన్ అభిమానులకు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినట్లే కదా…!
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో సి.కల్యాణ్ నేతృత్వంలోని ‘మన ప్యానెల్’ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. అధ్యక్షుడిగా సి.కల్యాణ్ ముందుగానే…
An Indian-origin man accused of defrauding the US government of at least $600,000 has been…