
అవును… పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో అఖిల్ వేడుకకు ఏఎన్నార్ హాజరయ్యారు. అక్కినేని ఫ్యామిలీ అంతా దిగిన ఫోటోలో ఏఎన్నార్ లేరన్న విషయం గమనించిన అభిమాని, ఏఎన్నార్ లేని లోటును పూడుస్తూ సదరు ఫోటోను ఎడిట్ చేసి, అందులో ఎవర్ గ్రీన్ ఏఎన్నార్ ను చేర్చారు. నిజంగా అక్కినేని అక్కడే ఉన్నట్లుగా కనపడుతున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
సాధారణంగా మెగా, ప్రిన్స్ వర్గాలు ఇలాంటి ఫోటో ఎడిట్ లతో సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తుంటారు. కానీ, ఈ సారి అక్కినేని ఫ్యాన్స్ వంతు వచ్చింది. వీక్షకులందరినీ మెస్మరైజ్ చేసే విధంగా ఉన్న ఈ ఫోటోను చూస్తూ… అక్కినేని ఫ్యాన్స్ కేక పుట్టించారుగా అంటున్నారు నెటిజన్లు. ‘మనం’తో చివరిసారిగా మెస్మరైజ్ చేసిన ఏఎన్నార్ ను తలచుకుంటూ అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…