
25 ఏళ్ల క్రితం వెలుగు చూసిన “బోఫోర్స్” కుంభకోణంలో దేశంలోని ప్రతి చేయీ తన కుటుంబాన్ని వేలెత్తి చూపిందని, ఈ నరకం పాతికేళ్ల పాటు సాగిందని తీవ్ర ఆవేదన వ్యక్తపరిచారు. ఎక్కడికెళ్లినా, ఏం చేసినా అంతా భోఫోర్స్ తోనే ముడిపెట్టి చూసేవారని, ఎన్నో ఆరోపణలు, ఇంకెన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని గతాన్ని స్మరించుకున్నారు.
బోఫోర్స్ కుంభకోణంలో అమితాబ్ కుటుంబానికి ఎలాంటి పాత్ర లేదని ఆ కేసును విచారించిన స్వీడిష్ కంపెనీలు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తమ కుటుంబాన్ని వదల్లేదని మదనపడ్డ అమితాబ్, ఆనాడు తమ కుటుంబం అనుభవించిన బాధను అప్పుడంటిన మరకలను ఎవరు తొలగించగలరని, చేదు పరిణామాలతో నరకం చూసిన తాము ఏవిధంగా స్పందిస్తామని ఆయన ప్రశ్నించారు.
Aarti Chikara is taking the internet by storm with a stunning new editorial shoot that…
KCR appears ready to take his political fight against the Revanth Reddy government back to…