
టీడీపీ గత ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసింది. అయితే వారి ప్రయాణం సరిగ్గా సాగడంలేదు అనేది అందరికి తెలిసిన విషయమే. టీడీపీ బీజేపీని వదిలి బయటకి రావాలని టీడీపీ అభిమానులే కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు మైండ్లో ఏముందో ఎవరికీ తెలీదు. విశ్వసనీయ వర్గాల కధనం బట్టి చంద్రబాబు జనసేన వైపు చూస్తున్నారని సమాచారం.
జనసేన తో కలిసి పోటీ చేసి వారికి ఒక 30-35 సీట్లు ఇవ్వొచ్చని చెబుతున్నారు. అటువంటి సమయంలో బీజేపీతో పొత్తు ఉండకపోవచ్చు. జనసేనకు అన్ని సీట్లు ఇచ్చాక టీడీపీ బీజేపీకి సీట్లు ఇవ్వడం కష్టం. అదే సమయంలో బీజేపీ కూడా అయోమయంలో ఉంది. టీడీపీతో విడాకులు తీసుకోవాలని కొందరు నాయకులు భావిస్తున్న సొంత బలంపై ఆ పార్టీ వారికే నమ్మకం లేదు.
ఒకదశలో అవసరమైతే జగన్ తో కలవాలని అనుకున్న నంధ్యాల ఉపఎన్నిక తరువాత ఆ విషయంగా పునరాలోచిస్తున్నారు. అయితే టీడీపీ జనసేన కలిసిపోటీ చేస్తే బీజేపీ వైకాపాతో కలవకతప్పదు. ఒకరకంగా చెప్పాలంటే 2019లో ఉండబోయే పొత్తులు అన్ని దాదాపుగా చంద్రబాబు నాయుడు నిర్ణయంపైనే ఆధారపడనున్నాయి.
The makers of Ramayana appear to be saving their biggest surprise for the very end…
రంభ ఊర్వశి మేనక అనే సినిమా ఈవారం విడుదలవుతుందా లేదా అనే విషయంలో కన్ఫ్యూజన్ కి ఎట్టకేలకు తెరపడింది. సెన్సార్…